సొంతగూటికి కాకా తనయులు

కాంగ్రెస్ కురువృద్ధుడు జి.వెంకటస్వామి(కాకా) తనయులు వివేక్, వినోద్‌లు టీఆర్ ఎస్ ను వీడి తిరిగి సొంతగూటికిచేరారు. సోమవారం వీరిద్దరూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ లో చేరినట్టు ప్రకటించారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని వివేక్ అన్నారు. కాగా తెలంగాణపై బీజేపీ వెనక్కి తగ్గిందని విమర్శించారు. గతంలో తెలంగాణ కోసమే కాంగ్రెస్ ను వీడామని, తెలంగాణ ఇచ్చినందున మళ్లీ కాంగ్రెస్ లో చేరుతున్నామని చెప్పారు.

వివేక్ బ్రదర్స్ కోరిన స్థానాల టికెట్లు ఇచ్చేందుకు సైతం హైకమాండ్ సుముఖత వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్‌లో చేరేందుకు గ త మూడు రోజులుగా ఢిల్లీలో హైకమాండ్ పెద్దలతో మంతనాలు నెరిపిన ఈ ఇద్దరు సోదరులు.. ఆదివారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌తో  సుమారు గంట పాటు చర్చలు జరిపారు. తాము పార్టీని వీడినా ఏనాడూ కాంగ్రెస్‌పైగానీ, అధినేత్రి సోనియాగాంధీపైగానీ వ్యతిరేకంగా మాట్లాడలేదని, కేవలం ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాలని మాత్రమే కోరుతూ వచ్చామని చెప్పారు.
సొంతగూటికి కాకా తనయులు సొంతగూటికి  కాకా తనయులు Reviewed by రాజాబాబు కంచర్ల on 2:38 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Facebook