టిడిపిలో చేరిన రాయపాటి సోదరులు..

గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు, అతని సోదరుడు రాయపాటి శ్రీనివాస్ చంద్రబాబు సమక్షంలో టిడిపి పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అధిష్టానంపై తిరుగుబావుటా ఎగురవేసిన రాయపాటి మొదట్లో కిరణ్ స్థాపించిన పార్టీవైపు వెళుతారని ప్రచారం జరిగింది. చివరకు వీరు టిడిపి పార్టీలో చేరారు. నరసరావుపేట నియోజకవర్గం నుండి రాయపాటి టిడిపి తరపున పోటీ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సూచించినట్లు సమాచారం.
     
టిడిపిలో చేరిన అనంతరం రాయపాటి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబుకే ఉందని, రాష్ట్రాన్ని జపాన్ లా అభివృద్ధి చేయడం టిడపితోనే సాధ్యమన్నారు.
టిడిపిలో చేరిన రాయపాటి సోదరులు.. టిడిపిలో చేరిన రాయపాటి సోదరులు.. Reviewed by రాజాబాబు కంచర్ల on 2:40 AM Rating: 5

కామెంట్‌లు లేవు:

Facebook